రాజ‌ధానిలో ఉగ్ర‌వాదులు


హైదరాబాద్ లో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా మతిపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ నలుగురిని రహస్య ప్రదేశంలో విచారించిన పోలీసులకు వాస్తవాలు తెలుసు కున్నారు. అయితే ఐదుగురు సభ్యులు జట్టు.. జనంలో ఉంటూ స్లీపర్ సెల్స్ గా ఉంటూ టెర్రరిస్టులకు సహాయం చేస్తున్నారనే పోలీసులు తెలిపారు. మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు. వీరంతా ఇండియన్ ముజాయిద్దీన్ కు సహకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ఐదుగురు.. హైదరాబాద్ లో జరిగిన వినాయక నిమజ్జనంలో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నారని కథనాలు వస్తున్నాయి. కాగా.. వీళ్ల టార్గెట్ మహాత్మాగాంధీ బస్ స్టాప్ అని కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ఇంటలీజెన్స్ సమాచారంతోనే పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. మరోవైపు టెర్రరిస్టుల టార్గెట్ లో.. అహ్మదాబాద్ తో సహా.. హైదరాబాద్ కూడా ఉందని.. రాష్ట్ర పోలీసులకు ఇంటలీజెన్స్ సమాచారం అందించినట్లు చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!