చిదంబ‌రానికి ప్ర‌ధాని అండ‌


2 జీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంమంత్రి చిదంబరంకు మద్దతు పెరుగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్ కూడా చిదంబ‌రాన్ని వెనుకేసుకొస్తున్నారు. చిదంబరంపై పూర్తి నమ్మకం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. చిదంబరంపై లీక్ అయిన లేఖపై.. మంత్రివర్గంలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. రాజకీయాలను అస్తిర పర్చేందుకు కొన్ని పక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. అలాగే మధ్యంతర ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు.. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. కాగా 2 జీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై సోమవారం సోనియాకు చిదంబరం వివరణ ఇచ్చారు. తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇదే విషయంపై సోనియాను కలిశారు. తర్వాత ప్రణబ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మూలస్థంబాల్లో చిదంబరం ఒకరని వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!