సిబిఐ ముందు చ‌ర‌ణ్ హాజ‌రు


ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సినీ హీరో రామ్ చరణ్ తేజ గురువారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. కాంగ్రెసు నాయకుడు చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్‌తో కలిసి రామ్ చరణ్ తేజ సిబిఐ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మార్ విల్లాలు కొనుగోలు చేసిన ప్రముఖులను సిబిఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తేజ సిబిఐ కార్యాలయానికి వచ్చారు. ఆయన పేర ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో విల్లా ఉంది. సిబిఐ ఇప్పటికే సినీ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!