కుప్ప‌కూలిన అపార్ట్‌మెంట్‌..


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శాంతినగర్ లో శుక్ర‌వారం సాయంత్రం ఓ అయిదు అంత‌స్థుల అపార్ట్‌మెంటు ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయింది. దీంతో చుట్టు ప‌క్క‌ల వారంతా భ‌యంతో ప‌రుగులు తీసారు. ఈ శిథిలాల క్రింద దాదాపు 25 మంది వ‌ర‌కు చిక్కుకుని ఉంటార‌ని భావిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కూ శిథిలాల చిక్కుకున్న వారిలో అయిదు మందిని ర‌క్షించ‌గ‌లిగారు. అయితే మిగ‌తా వారు ఇంకా శిథిలాల క్రిందే ఉన్నారు. సెల్లార్‌లో ఆ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ భార్య‌తోపాటు 9 మంది చిన్న‌పిల్ల‌లు ఇరుక్కుపోయారు. వీరిని ర‌క్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే జోరుగా వ‌ర్షం కురువ‌డంతో పాటు చీక‌టి ప‌డుతుండ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కి కొద్దిగా ఆల‌స్యం జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. పెద్ద పెద్ద లైట్స్‌ని ఏర్పాటు చేసి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ని వేగ‌వంతం చేస్తున్నారు. శిథిలాల మ‌ధ్య‌లో చిక్కుకుపోయిన వారు అరుపులు పెడుతుండ‌టంతో వారిని ర‌క్షించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!