ఊస‌ర‌వెల్లి ఆడియో నేడే..


ఎన్టీఆర్‌, త‌మ‌న్నా జంట‌గా రూపొందిస్తున్న ఊస‌ర‌వెల్లి నేడు మార్కెట్లో విడుద‌ల కాను న్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. శిల్పకళావేదికలో చలనచిత్ర ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానుల సమక్షం లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఊస‌ర‌వెల్లి పాట‌ల్ని ఘ‌నంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేసారు. కాగా ఈ చిత్రంపై అటు ఎన్టీఆర్‌, ఇటు ద‌ర్శ‌కుడు ఇద్ద‌రూ భారీ ఆశ‌ల్ని పెంచుకున్నారు. కిక్ చిత్రం త‌ర్వాత సురేంద‌ర్‌రెడ్డి చేస్తున్న ఈ చిత్రంపై ప‌రిశ్ర‌మ‌లో కూడా భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఇక ఈ రోజు విడుద‌ల‌య్యే ఆడియో జ‌నాల‌కి న‌చ్చేవిధంగా ఉంటే సినిమా స‌క్సెస్ రేట్ కూడా పెరిగే అవ‌కాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో చూపించే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. రొమాన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ అన్నీ మేళవించిన చిత్రం ‘ఊసరవెల్లి’. సందర్భానుసారం రంగులు మార్చుకుంటూ తన లక్ష్యాన్ని మంచి మార్గంలో హీరో ఎలా చేరుకున్నాడనేది ఈ సినిమా సబ్జెక్ట్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!