ఢిల్లీలో కొండాల‌క్ష్మణ్ నిరాహ‌ర దీక్ష



ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష నేటి నుంచి వారంపాటు చేయనున్నారు. అంతకు ముందు ఆయన గాంధీజీ సమాధి స్థలం రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అక్కడే గంటపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు జంతర్‌మంతర్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షలో కూర్చుంటారు. ఈ నిరాహార దీక్ష వారంపాటు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. లక్ష్మణ్ దీక్షకు ఎంపీ మధుయాష్కీ, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, నాగం జనార్ధనరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!