ఢిల్లీలో కొండాల‌క్ష్మణ్ పాద‌య‌త్ర


పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గురువారం ఉదయం ఇండియా గేట్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఇక్కడ నుంచి ఆయన పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేపట్టనున్నారు. అనంతరం స్పీకర్ ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.  కొండా లక్ష్మణ్ బాపూజీ పాదయాత్రలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, వివేక్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేశవరావు, టీడీపీ నేతలు గుండు సుధారాణి, ఎర్రబెల్లి దయాకరరావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!