టిఆర్ఎస్ సోనియాని విమ‌ర్శిస్తుందా..?


తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నాయకులు టిఆర్ఎస్ కు ఒక పరీక్ష పెడుతోంది.తెలంగాణ ఇవ్వడం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేసినందున తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె.చంద్రశేఖరరావు తాము కోరిన విధంగా సోనియాగాంధీ దిష్టిబొ్మ్మలు దగ్దం చేయాలని పిలుపు ఇచ్చారు. తాము సోమవారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీల దిష్టిబొ్మ్మలు దహనం చేస్తుందని టిడిపి తెలంగాణ పోరం నేత ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. కెసిఆర్ కాంగ్రెస్ తో మాచ్ ఫిక్సింగ్ చేసుకుని నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ప్రధానిని మాత్రం విమర్శిస్తూ, అసలు కారణమైన సోనియాగాంధీ జోలికి ఎందుకు వెళ్లడం లేదని దయాకరరావు ప్రశ్నించారు. కాగా మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణపై ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడూ మోసం చేస్తోందని అన్నారు. తెలంగాణ సమస్య వల్ల జాతీయ స్థాయిలో సమస్యలు వస్తాయని చెబుతున్న ప్రధాని రెండువేల తొమ్మిది డిసెంబరు తొమ్మిదిన ఎందుకు తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించారని ప్రశ్నించారు.మరో నేత రమణ మాట్లాడుతూ కెసిఆర్ మొదటి నుంచి తెలంగాణాను అడ్డుపెట్టుకుని వ్యవహారం చేస్తున్నారన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!