త‌న మార్కు పాల‌న‌కై కిర‌ణ్ త‌హ‌త‌హ‌


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర వేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్కీములను మరిపించడానికిగాను కొత్త కొత్త పధకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రూపాయికి కిలో బియ్యం పధకం, రాజీవ్ యువ కిరణాలు వంటి స్కీములను ఆరంభించిన కిరణ్ తాజాగా మహిళలకు వడ్డీలేని రుణాల పధకాన్ని ప్రకటించారు. పదివేల కోట్ల రూపాయల మేర రుణాలను వడ్డీ లేకుండానే ఇస్తామని ఆయన చెప్పారు.ఇప్పుడిప్పుడు కుదుటన పడుతున్న కిరణ్ ప్రభుత్వం కొత్త పధకాల ద్వారా ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియలో ఆయన విజయవంతంగా బయటపడతారా? అన్నది చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!