కేసీఆర్‌పై టి-టిడిపి నేత‌లు ఫైర్‌


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ద్రోహం వల్లనే తెలంగాణ రాష్ట్రం రావడం లేదని టిడిపి తెలంగాణ ఫోరం నేతలు ధ్వజమెత్తారు. కెసిఆర్ నాటకాలు, టిఆర్ఎస్ నాటకాలు, కాంగ్రెస్ నాటకాలను, సోనియాగాంధీతో టిఆర్ఎస్ తో ఉన్న అవగాహనను ప్రజలు అర్ధం చేసుకోవాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీలను , జెండాలను పక్కనబెట్టమని తాము చెబుతుంటే,ఇతర పార్టీలవారిని కలుపుకుని తాను బలపడాలని చూస్తూ, తెలంగాణరాష్ట్ర సాధన అంశాన్ని కెసిఆర్ పక్కనబెట్టారని వారు టిడిపి తెలంగాణ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నరసింహులు మీడియాతో మాట్లాడారు.తెలంగాణ గురించి ఏమి సాధించారని పార్లమెంటుకు కెసిఆర్ వెళ్లారని దయాకరరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్.పిలు అంతా పోడియంను చుట్టుముడితే ఈయన మాత్రం తన సీటు వద్దే ఉన్నారని అన్నారు. కొండా లక్ష్మణ్ భాపూజీ ఎమ్.పిలనందరిని ఆహ్వానించినా కెసిఆర్ మాత్రం రావడం లేదని, టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే బాపూజీ ఇంటిలోనన్న సంగతిని ఆయన మరవరాదని దయాకరరావు అన్నారు. తెలంగాణ ప్రజలంతా కెసిఆర్ ద్రోహాన్ని గుర్తించాలని, కేవలం తను, తన కుటుంబం సంపాదించుకోవడానికే పార్టీని పెట్టుకున్నారని, తెలంగాణ అంశాన్ని ఆయనే తన స్వార్ధానికి వాడుకున్నారని మోత్కుపల్లి నరసింహులు అరోపించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!