శ్రీ‌వారికి ఖ‌రీదైన వ‌జ్రాలు కానుక‌


తిరుమల వెంకన్నకు 162 మేలిమి వజ్రాలు కానుకగా అందాయి. ముంబైకి చెందిన ఓ అజ్ఞాత భక్తుడు హుండీలో ఈ విలువైన వజ్రాల ముడుపుల మూట సమర్పించాడు. శ్రీవారి ఆలయంలోని పరకామణిలో సోమవారం నిండిన హుండీలను బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా వజ్రాల మూటను సిబ్బంది గుర్తించింది. ఈ వజ్రాల మూటలోనే భక్తుడికి సంబంధిం చిన వివరాలు కూడా ఉన్నట్లు సమాచారం. వాటిని బుధవారం టీటీడీ అప్రైజర్లు (నాణ్యత, విలువ మదింపుదారులు) పరిశీలించి మేలిరకపు వజ్రాలని, విలువ రూ.1.5 కోట్లు పైబడి ఉంటుందని అంచనా వేశారు. దీనిపై టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. 72 రకాలైన 162 వజ్రాలు హుండీలో వేశారని, వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!