చిరంజీవి కేంద్రమంత్రి కాబోతున్నారా..?


మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డంఖా భజాయించి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవికి అధిష్టానం కేంద్ర మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల అది నెరవేరడంలో జాప్యం జరుగుతోంది. దీనిపై పిసిసి అధ్యక్షుడుగా ఉన్న బొత్సను ఎవరైనా ప్రశ్నిస్తే చిరంజీవి కేంద్ర మంత్రి అవడం ఖాయం.అది కూడా మరి కొద్ద నెలలలోనే అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. అలా ఎలా చెప్పగలుగుతున్నారని అడిగితే అది పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం . కావాలంటే వేచి చూడండి అని ఆయన అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాజ్య సభ ఎన్నికలలో చిరంజీవికి టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే అంతకుముందే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని బొత్స అభిప్రాయ పడుతున్నారు.మంత్రి పదవిలోకి వచ్చాక ఆరు నెలలలోగా పార్లమెంటుకు ఎన్నికైతే సరిపోతుంది కనుక ఇబ్బంది ఉండదని అంటున్నారు. చిరంజీవి మా పార్టీ నాయకుడు అని బొత్స సంతోషంగా చెబుతున్నారు. అయితే ఈ మద్య చిరంజీవి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినా చేస్తానని అనడంతో రకరకాల ప్రచారాలు వచ్చాయి. ఆయన రాష్ట్ర పదవితోనే సరిపెట్టుకొంటారేమోనన్న భావన కలిగింది. కాని ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు బొత్స చెబుతున్న మాటలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక ఎంతకాలంలో చిరంజీవి కేంద్ర మంత్రి అయి ఆయన అభిమానులను అలరిస్తారో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!