తలలు తెగిపడినా.. తలవంచం..

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ప్రభుత్వం తనపై వంద కేసులు పెట్టిందన్నారు. తెలంగాణ ఒప్పందాలను తుంగలోకి తొక్కారని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యమం గమ్యానికి చేరుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు దుబాయిలోనే తెల్లరిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లో తెలంగాణ వాణి వినిపించకుండా కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాలూ బాగుపడతాయన్నారు. తెలంగాణ గురించి అంతా తెలిసినా ప్రధాని మౌనంగా ఉంటున్నారని… ఆయన ప్రధానిగా ఉండటం మన కర్మ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని చూసి పాలకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. పిడికెడు మంది నాయకులు తప్పా రాష్ట్ర విజభనకు అంతా అనుకూలమేనన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి