జ‌గ‌న్‌కి మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేల షాక్‌


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు క్రమేపి ఆ పార్టీకి దూరం అవుతున్నారు.కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి జగన్ వర్గానికి దూరం అయి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడానికి రంగం సిద్దం అయినట్లు చెబుతున్నారు.కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసినట్లు తెలిసింది.ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ గా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అలిగిన రాంభూపాల్ రెడ్డి జగన్ కు దగ్గరయ్యారు.కాగా ఆయన సమీప బందువు గాలి జనార్ధనరెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయ్యాక జరిగిన పరిణామాలలో ఆయన మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా?లేదా అన్నది చూడాలి. కాగా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి కూడా అదే బాటలో ఉన్నారని చెబుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే శేషారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లోకి వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ప్రకటించగా ఇప్పుడు ద్వారంపూడి అదే రూటులో ఉండడం విశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!