అపురూప దృశ్య కావ్యం శ్రీరామరాజ్యం

ఫస్ట్ హాఫ్ చాలా బాగున్న ఈ చిత్రం సెకెండాఫ్ లో కాస్త స్లోగా మారి ఓకే అనిపించిందని అంటున్నారు. టోటల్ గా ఓ కమనీయ కావ్యం చూసామని కొందరంటున్నారు. లవకుశలుగా వేసిన పిల్లల నుంచి మంచి నటనను బాపు రాబట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా అయోధ్యలో లవకుశలు పాడే పాట చాలా హృధ్యంగా తెరకెక్కించారని, అదే సినిమాకి హైలెట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. నాగేశ్వరరావు, నయనతార ఎవరకి వంక పెట్టలేని విధంగా పోటీపడి మరీ సీన్స్ పండించారని టాక్. ఓవరాల్ గా ఓ మంచి చిత్రం చూసామని, ఈ సినిమా ప్రభావంతో అయినా మళ్ళీ పౌరాణికాలు తెలుగులో మొదలైతే చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి