జ‌గ‌న్‌కోసం ఢిల్లీకి సుబ్బారెడ్డి


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రముఖుడు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాబాయి అయిన వై.వి.సుబ్బారెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కువసార్లు ఢిల్లీ యాత్ర చేస్తున్నారు. దానికి కారణం ఊహించడం పెద్ద కష్టం కాదు. కాని ఆయన ఎవరెవరితో ఏమి మంతనాలు జరుపుతున్నారన్నది ఆసక్తికరమైన అంశం. జగన్ పై ఆస్తుల కేసు వచ్చినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఢిల్లీయాత్రలు ఎక్కువగా చేయవలసి వస్తున్నదని, అక్కడ అవసరమైన తెరవెనుక వర్క్ చేయవలసి వస్తున్నదని అంటున్నారు. అంటే ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రముఖులతో మంతనాలు జరపడం, వారిని తమకు సానుకూలంగా మార్చుకోవడంలో సుబ్బారెడ్డి అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.ముఖ్యంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి,కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీతో సంప్రదింపులు జరపడంలో సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. సుబ్బారెడ్డి యత్నాలు కొంత మేర ఫలించాయని,
దానివల్ల కూడా జగన్ కు మరీ ఇబ్బంది కర పరిస్థితి తలెత్తకుండా ప్రస్తుతానికి ఉపయోగం జరిగిందని అంటున్నారు. సుబ్బారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కూడా రాజకీయంగా అండదండలు అందిస్తూ ఉండేవారు. వై.ఎస్. మరణం తర్వాత కుటుంబ పరంగా కూడా సన్నిహితుడు కావడంతో జగన్ ను వెన్నంటి ఉంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అదినాయకత్వ ప్రముఖులకు , జగన్ కు మద్యవర్తిత్వం నడపడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!