జ‌గ‌న్ అనుచ‌రుల‌పై రౌడీషీట్‌


వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ముద్రపడిన ఇద్దరి పైన పులివెందుల పోలీసులు రౌడీషీట్ తెరిచారు. జగన్ ముఖ్య అనుచరుడిగా ముద్ర పడిన దంతులూరు కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పైన స్థానిక పోలీసులు రౌడీషీట్ తెరిచారు. దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో సిబిఐ మంగలి కృష్ణను విచారించడంతో ఆయన పేరు ప్రముఖంగా బయటకు వచ్చింది. హైదరాబాదులోని సూట్ కేసు బాంబు కేసు విషయంలోనూ ఆయనను విచారించారు.
పులివెందులలో మంగలి కృష్ణతో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పైనా పలు కేసులు ఉన్నాయి. ఉప ఎన్నికల సమయంలో వీరిద్దరిని నగర కూడలిలోకి పిలిపించి పోలీసులు హెచ్చరించారని తెలుస్తోంది. ఆర్టీసి బస్టాండ్ వద్ద మూడు నెలల క్రితం జరిగిన ధర్నాకు సంబంధించి ఈ ఇద్దరి పైనా కేసులు నమోదయ్యాయి. ఉప ఎన్నికల సమయంలో మంగలి కృష్ణపై బైండోవర్ కేసు నమోదైంది. ఇవే కాకుండా ఇతర ప్రాంతాలలోనూ కృష్ణపై కేసు ఉన్నట్లుగా తెలుస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!