లుంగీలు మార్చిన‌ట్టు పెళ్ళాల‌ని మారుస్తాడా..?


ఈమ‌ధ్య న్యూస్ ఛానెల్స్‌లో లైవ్‌షోలు పెరిగిపోయాయి. ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం ద్వారా నాయ‌కుల మాట‌ల‌ని య‌థాత‌థంగా ప్ర‌సారం చేసి అందిస్తున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. విశ్లేష‌నాత్మ‌కంగా సాగిపోయే ఈ కార్య‌క్ర‌మాల్లో ఒక్కోసారి నాయ‌కుల మ‌ధ్య మాటా మాటా పెరిగి తాము లైవ్‌షోలో పాల్గొన్నామ‌న్న‌ స్పృహ‌లేకుండా నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు. తాజాగా ఎన్‌.టి.విలో జ‌రిగిన ఓ లైవ్ కార్య‌క్ర‌మంలో విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్, నల్లగొండ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డిల మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది.లగడపాటి రాజగోపాల్ కేవలం ధనమదంతో మాట్లాడుతున్నారని, ఒక బిసి ఎమ్.పి అయిన పొన్నం ప్రభాకర్ ను అటెండర్ అని అంటారా అని తీవ్రంగా ప్రశ్నించారు.. దానికి స‌మాధానంగా పొన్నం ప్ర‌భాక‌ర్ త‌న‌ని బ‌ద్మాష్ అని అన్నాడ‌ని అందుకే తాను అలా స్పందించాల్సి వ‌చ్చింద‌ని అన్నాడు. తెలంగాణ అంశాన్ని నీరు కార్చేందుకు ల‌గ‌డ‌పాటి త‌న‌దైన శైలిలో పావులు క‌దుపుతున్నాడ‌ని, ఆంధ్రాలో హీరో అవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని గుత్తా విమ‌ర్షించాడు.. ఈ దశలో ఇద్దరి మధ్య మాట,మాట పెరిగి లుంగీలు మార్చినట్లు పెళ్లాలు మారుస్తావ్, బుద్ది లేదు..అంటూ సుఖేందర్ రెడ్డి కాస్త ఆవేశపడ్డారు. ఇలా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌లో దుర్భాష‌లాడ‌టం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం.. ప్ర‌పంచం మొత్తం తామ‌ని గ్ర‌హిస్తుంద‌న్న స్పృహ‌లేకుండా వ్య‌క్తి గ‌త దూష‌ణ‌ల‌కి పోకుండా హుందాగా ప్ర‌వ‌ర్తిస్తే నాయ‌కులకు కాస్త‌యినా గౌర‌వంగా ఉంటుంద‌ని గ్ర‌హించాలి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!