త్వ‌ర‌లోనే స‌ర్కారు కూలుతుంది..



ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అటు కాంగ్రెస్ కు, ఇటు తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా దక్కవని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అనంతపురంలో జరుగుతున్న ఓదార్పు యాత్ర ఇవాళ మూడో రోజుకు చేరింది. ఓదార్పుయాత్రలో ప్రభుత్వ పనితీరును.. ఎండగడుతున్న జగన్.. రాష్ట్ర రాజకీయాలను దేవుడు గమనిస్తున్నాడని చెప్పారు. అసలు రాష్ట్రంలో సరైన నాయకుడు లేడని.. పేదవాళ్లను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని జగన్ ఆవేదన చెందారు. అన్నదాతల కష్టాలను రాష్ట్ర సర్కార్ చూస్తూ ఉందే తప్ప.. వాళ్లను ఆదుకునేందుకు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలుతుందని.. జగన్ చెప్పుకొచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!