కాంగ్రెస్ కష్టాలలో లేదట..!


పిసిసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ తనకు పదవి దక్కినందుకు ఆశ్చర్యం కలిగించిదని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రతిష్టకు తగ్గకుండా తాను బాధ్యతలు నిర్వహిస్తానని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనందరిదని ఆయన అన్నారు. పార్టీని భవిష్యత్తులో విజయపధం లో నడిపిస్తానని ఆయన చెప్పారు.విజయనగరం చేరుకున్నప్పుడు బొత్సకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బొత్స ప్రసంగిస్తూ, కాంగ్రెస్ కష్టాలలో ఉందని అంటున్నారు , కాని తనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన జనాన్ని చూస్తే అది సరికాదని అర్ధం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
వై.ఎస్.ఆర్. ఆశయాలను,ఆయన స్కీములను ఎక్కడా విస్మరించడం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సోనియాగాంధీ నాయకత్వంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా బొత్స చెప్పారు.విజయనగరం జిల్లాలో బొత్స తన హవాను మరోసారి ప్రదర్శించారని అంతా చెప్పుకుంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!