భార‌త్‌, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ నేడు..



కింగ్‌స్ట‌న్‌లో నేడు వెస్టిండీస్‌, భార‌త్ మ‌ధ్య తొలి టెస్టు స‌మ‌రం జ‌ర‌గ‌బోతోంది. 35 ఏళ్ళ త‌ర్వాత వండే సిరీస్‌ని భార‌త్ వ‌శం చేసుకున్న‌ప్ప‌టికి చివ‌రి రెండు వండే మ్చాచ్‌లు విస్టిండీస్ గెలుచుకోవ‌డం, జ‌మైకా పిచ్ పూర్తిగా ఫేస్‌కి అనుకూలించేదిగా రూపొందించ‌డం చూస్తుంటే భార‌త్‌కి ఈ మ్యాచ్ గెల‌వ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తుంది.. పైగా అనుభవజ్ఞుడైన పేసర్ ఒక్కరూ అందుబాటులో లేకపోవడం ధోనీసేనను కలవరపెడుతోంది. విండీస్ పర్యటనకు సచిన్, సెహ్వాగ్, గంభీర్‌తో పాటు జహీర్ పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఓపెనర్ మురళీ విజయ్, మీడియం పేసర్ మునాఫ్ గాయాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయం. వీరిద్దరూ తొలి టెస్ట్‌లో ఆడేది సందేహంగా మారింది. టి-20, తొలి మూడు వన్డేల్లో ఓటమి చవిచూసిన సామీ సేన ఎట్టకేలకు చివరి రెండు వన్డేల్లో గెలుపొంది కాస్త ఊరట పొందింది. సీనియ‌ర్లు దూరంగా ఉన్న‌ప్ప‌టికి యువ టీం సిరీస్‌ని గెలుచుకుని ఆత్మ‌విశ్వాసాన్ని నింపుకున్న‌ప్ప‌టికీ ఈ టెస్ట్ క్రికెట్ కూడా భార‌త్‌కి స‌వాల్‌గా మార‌నుంది..
ఈ రోజు రాత్రి 8.30 నుండి డిడి ఛానెల్‌, టెన్ క్రికెట్ ఛానెల్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!