జ‌గ‌న్ వర్గంపై వేటు లేన‌ట్టేనా..?


జగన్‌ వర్గ ఎమ్మెల్యేల పై వేటు వేసేందుకు కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.పీసీసీ పగ్గాలు చేపట్టాక   బొత్స కొంత హడావిడి చేసినా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  ఆజాద్ జోక్యం తో వెనక్కి తగ్గారు.కొంత కాలం పాటు చూసి చూడనట్టు  వ్యవహరించాలని ఆజాద్ చెప్పినట్టు సమాచారం .తొందర పడి జగన్ వర్గ ఎమ్మెల్యేల పై వేటు వేస్తె ఉపఎన్నికలు వస్తాయని , ఆ ఎన్నికల్లో గెలవక పోతే పరువు పోతుందని అధిష్టానం మధనపడుతోంది . ఒక రకంగా చెప్పాలంటే అధిష్ఠానం పరిస్థితి అడకత్తెరలో  పోకచెక్కలా తయారైంది . ఇదిలా వుంటే  ఆజాద్ ఎలాగైనా  జగన్ ను బుజ్జ్జగించి  మళ్ళీ కాంగ్రెస్ లోకి  తీసుకొచ్చేయత్నాల్లో వున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది .అందుకే  చర్యల విషయం లో వ్యూహాత్మకం గా  పార్టీ వెనకడుగు వేసిందని అంటున్నారు.  ఈ నేపధ్యం లో ఇప్పట్లో జగన్ వర్గ ఎమ్మెల్యే లపై చర్యలేవీ ఉండవని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!