టెస్ట్ మ్యాచ్‌లో ద్ర‌విడ్ సెంచ‌రీ…



వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టుబిగిం చింది. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ విలువైన ఇన్నింగ్స్ ఆడి త‌న 32వ సెంచ‌రీని న‌మోదు చేయ‌డంతో ప్రత్యర్థి ముందు 326 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మూడు వికెట్ల నష్టానికి 91 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బుధవారం ఆటకొనసాగించిన భారత్ 252 పరుగులకు ఆలౌటయింది. ద్రావిడ్ 112 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక టెస్టుల్లో బ్యాట్‌కి ప‌నిచెబుతార‌ని భార‌త్‌ని ఆదుకుంటార‌ను కున్న విజ‌య్‌, వి.వి.ఎస్‌. ల‌క్ష్మ‌ణ్‌లు అవుట్ కావ‌డం నిరాశ క‌లిగించే అంశం.. ద్రావిడ్‌తో పాటు మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ కూడా ముందు ముందు రానిస్తే టెస్ట్ సిరీస్ కూడా భార‌త్ వ‌శం అవుతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!