పోలీస్ ప్రతిష్ట మరింత పెంచుతా-దినేష్ రెడ్డి


పోలీసు శాఖ ఔన్నత్యాన్నిపెంచుతానని కొత్త గా డిజిపిగా నియమి తులైన దినేష్ రెడ్డి అన్నారు.తనను డిజిపిగా నియమిం చడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞత లు తెలిపారు.తాను చిత్తశుద్దితో పని చేస్తానని, పేదవాడికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నా రు. ముఖ్యమంత్రి ఆశించిన అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన అన్నారు. పోలీసు శాఖలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఒక ప్రత్యేకత ఉందని,దానిని కాపాడతానని,పోలీసు శాఖ పతాకం మరింత పైకి ఎగిరేలా దోహదపడతానని దినేష్ రెడ్డి తెలిపారు. దినేష్ రెడ్డి డిజిపి కాగానే పలువురుఆయనకు శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనోభావాలపై సంక్షిప్తంగా వ్యాఖ్యలు చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!