సిధ్దార్థ్‌ పై ఎల‌క్ట్రానిక్ మీడియా ఫిర్యాదు


ప్రముఖ సినీ హీరో సిద్దార్ద కొద్ది రోజుల క్రితం మీడియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.,వీటిపై ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన ప్రతినిధులు తీవ్ర ఆక్షేపణ చెప్పడమేకాకుండా, ఆయనపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియే షన్ కు కూడా ఫిర్యాదు చేశారు.సిద్దార్ధ్ ట్విట్టర్ లో చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ దర్డ్ గ్రేడ్ గా మారాయని, ఒక గంటసేపు టవీని నడపడం కోసం తమ కుటుంబ సభ్యులకు కూడా అమ్ముకుంటారని, చెత్తచెదారం చూపిస్తారని, అబద్దాలు ప్రసారం చేస్తారని వ్యాఖ్యానించారు. మీడియాను ఉద్దేశించి ఆయన తొలిసారిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో కూడా ఇలాగే మాట్లాడి తమ మనో భావాలను గాయపరిచారని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.తద్వారా మీడియా గౌరవాన్ని వ్యక్తులుగా తమ వృత్తి గౌరవానికి ఆయన భంగం కలిగిస్తున్నారని మీడియా ప్రతినిదుల తరపున సంఘం ఉపాద్యక్షుడు లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై సిద్దారమీద ఫిర్యాదు చేస్తూ ఎపి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలికి కూడా ఫిర్యాదు చేశామన్నారు.దీనిని పరిశీలిస్తున్నామని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ చెప్పారు.సిద్దార్ధ మీడియాకు క్షమాఫణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు.కాగా ఈ ఫిర్యాదును నిర్మాత దిల్ రాజుకు కూడా పంపించారు. వచ్చే సినిమాను దిల్ రాజు సిద్దార్ధతో తీస్తున్నారు. మరి దిల్ రాజు ఈయనకు క్షమాపణ చెప్పమని సలహా ఇస్తారా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!