అన్నా హజారే దీక్ష ఇక తప్పదు..
ఆగస్టు 16 నుంచి మళ్ళీ అన్నా హాజరె దీక్ష ప్రారంభిస్తానని అన్నా హాజరె పేర్కొన్నారు .బలమైన జన లోక్పాల్ రూపొందించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అది ప్రజలను మోసం చేస్తోన్న నేపధ్యం లో తనకి నిరశన దీక్ష చేయడం మినహా మరో మార్గం లేదని అన్నారు .దేశ ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు’ తెలిపారు లోక్పాల్ ముసాయిదా కమిటీ చివరి భేటీ ముగిసిన అనంతర పరిణామం ఇది .కమిటీలోని ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధుల మధ్య తలెత్తిన విభేదాలు అలాగే ఉన్నాయి. లోక్పాల్ పరిధిలోకి ప్రధాని రావాలి అనే అంశం తో పాటు మరో ఆరు అంశాల మీద ఏకాభిప్రాయం కుదరలేదు .వాటిపై ఏకాభిప్రాయం అసాధ్యమని , లోక్పాల్ పేరుతో ఎవరికీ జవాబుదారీ కానీ సమాంతర వ్యవస్థ ఏర్పాటుకావడాన్ని ప్రభుత్వం సహించబోదని కపిల్ సిబాల్ తేల్చేసారు దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం కష్టం అని గ్రహించిన అన్నా హజారే దీక్ష కి పూనుకోనున్నట్లు తెలిపారు .
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి