క‌రుణానిథి కూడా అన్నాహ‌జారేకు మ‌ద్ద‌తు..!


తన కుమార్తె కనిమొళిని తీహారు జైలులో నిర్భంధించడానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తట్టుకోలేక పోతున్నారు. మీడియాలో ప్రచారమైన ఆరోపణలను నిజంచే యడానికి సిబిఐ ప్రయత్నిస్తోందని అన్నారు.కనిమొళిని అమా నుషంగా నిర్బంధించారని, కనిమొళి, కళైంగర్ టివీ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్ లు అనారోగ్యంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.కాఆ లోక్ పాల్ బిల్లు పరిధిలోకి ప్రధాని పదవిని కూడా తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు . కాంగ్రెస్ పార్టీపై కోపం ఉన్నప్పట్టికీ రాజకీయ పరిస్థితుల రీత్యా ఆయన తగ్గి ఉంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే అవకాశం వచ్చిందని భావిస్తున్న కరుణానిధి లోక్ పాల్ బిల్లును అందుకు ఆసరాగా తీసుకుంటున్నారు. ప్రధాని పదవిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పడం ద్వారా కరుణానిధి ఈ ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పై విరుచుకుపడే పరిస్థితి రాలేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!