లగడపాటి ఓ జోకర్..!




విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ జోకర్ అని తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఆదివారం విమర్శించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పట్నం రోడ్లపైనే పొయ్యి కార్యక్రమంలో భాగంగా ఆమె హైటెక్ సిటీ వంటావార్పులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. లగడపాటి తెలంగాణ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని సమస్యలపై స్పందిస్తోందని మరి తెలంగాణ అంశంపై స్పందించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు.
కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఐటి ఉద్యోగులు కూడా మద్దతు ఇస్తున్నారని తెలంగాణ ఐటి ఉద్యోగులు చెప్పారు. ఐటి ఉద్యోగుల మద్దతు లేదనే వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. త్వరలో ఐటి ఉద్యోగులమందరం కలిసి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి తెలంగాణ కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!