పాలిటిక్స్‌కంటే సినిమానే పసందు..


చేగొండి హరిరామజోగయ్య.. ఆయన ఎక్కడున్నా ఏదో ఒక సంచలనం సృష్టిస్తుంటారు.అనేక పార్టీలను చుట్టి వచ్చిన హరిరామజోగయ్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా,ఎమ్.పిగా, అంతకుముందు, సమితి అధ్యక్షునిగా, జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పలు పదవులు నిర్వహించారు. మధ్య,మధ్యలో సినిమాలు తీస్తుండేవారు. రెండువేల నాలుగులో ఆయన నర్సాపురం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆయన వై.ఎస్.రాజశేఖరరెడ్డితో సరిపడలేదు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి రావడానికి సన్నాహాలు చేస్తుండడంతో హరిరామజోగయ్య కూడా వెంటనే అటువైపు మళ్లారు. ఒక దశలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి అత్యంత అవినీతిపరుడంటూ సంచలన ఆరోపణలు చేసి రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీల పాత్ర పోషించారు. కాని పార్టీ పరాజయంతో ఆయన కూడా చిరంజీవి కి దూరం అయ్యారు. ఆ మధ్య వై.ఎస్.జగన్ ను కూడా కలిసి మాట్లాడారు కాని ఆ పార్టీలో చేరలేదని చెప్పారు. ఆ తర్వాత ప్రస్తుతం సినిమాలు తీయడంలో బిజీ అయ్యారు. తెలుగమ్మాయి అనే సినిమాను ఆయన మరో నిర్మాత కరాటం బాబూరావుతో కలిసి నిర్మిస్తున్నారు.మహిళల కోసం పోరాడే తెలుగమ్మాయి ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని హరిరామజోగయ్య చెప్పారు.గతంలో జోగయ్య తీసిన కొన్ని సినిమాలకు అవారుడ్డులు కూడా వచ్చాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!