వైఎస్ బాట‌లోనే కిర‌ణ్‌కుమార్‌రెడ్డి..!


సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వివరాలును మీడియాతో పంచుకున్నారు. 14ఎఫ్ రద్దు కోసం కేంద్రానికి కోరామని ప్రకటించారు. దీంతో 14ఎఫ్ పై జరుగుతున్న రగడకు బ్రేకులు పడినట్లే. అలాగే తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుం టుందని, సరైన సమయంలో సరైన నిర్ణయం వస్తుందని సీఎం చెప్పుకొచ్చారు( గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం). తెలంగాణపై నిర్ణయానికి టైం వచ్చిందో లేదో కేంద్రమే చెప్తుందని చెప్పారు. త్వరలో జరుగబోతున్న దీక్షలపై ప్రశ్నించగా వాటిని వారు దీక్షలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని చెప్పారు. ఆరునెలలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను అలాగే ఈ సమస్యను కూడా ఎదుర్కొంటానని తెలిపారు. గతంలో వైఎస్ చేసిన మాదిరే కిరణ్ కూడా మాట్లాడారంటే తెలంగాణపై కేంద్రనిర్ణయంలో కొంతజాప్యం తప్పదన్నట్లుగా కనిపిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!