ఒక గుండు, ఒక గ‌డ్డం క‌థ‌..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కిరణ్ కుమార్ రెడ్డి గుండు కొట్టించుకున్నారని, అలాగే తిరగడం లోఉద్దేశం జనం ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడానికేనని చంద్రబాబు అన్నారు. కొద్దికాలం క్రితం తిరుమల ఆలయాన్ని సందర్శించి కిరణ్ కుమార్ రెడ్డి తలనీలాలు సమర్పించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించుకుంటే ఇలా మాట్లాడతారా? అని పిసిసి అదికార ప్రతినిది తులసిరెడ్డి విమర్శించారు. కిరణ్ గుండు గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు తన పిల్లిగడ్డం గురించి ఏమి చెబుతారని ఆయన ప్రశ్నించారు. కాగా చంద్రబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి డిమాండు చేశారు.చంద్రబాబునాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే బాగుంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!