రాజమండ్రిలో కామపిశాచులు


ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, బాలికలపై దాడులు,మానభంగాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మీడియా మహిమో..మహిళలే ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు తెచ్చి పోరాడుతున్నారో తెలియదు కానీ మొత్తానికి రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఎక్కువగా బయ టకు వచ్చి కిరాతకులకు శిక్షలు పడుతున్నాయనే చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఓ తొమ్మిదేళ్లబాలికపై రాజ మండ్రి రైల్వేస్టేషన్ కు సమీపంలో నలుగురు యువకులు రేప్ చేశారు. పట్టపగలే చుట్టుపక్కల జనం చూస్తుం డగా జరిగిన చర్య. స్థానికులు వచ్చి ఆ కామపిశాచులను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అందు లో ఒకరు పట్టుబడగా, మిగతా ముగ్గురు పరార్ అయ్యారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో కూడా ఉదయం బిటెక్ విద్యార్థిని రుపా ప్రేమోన్మాది వేధింపులు తాళలేక సూసైడ్ నోట్ రాసి కిరోసిన్ పోసుకొని ఆత్మ హత్య చేసుకుంది. అయితే ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఈమధ్య ఈ ప్రాంతం.. ఆ ప్రాంత మని కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుండటంతో దీనిపై అన్నిపక్షాలు స్పందించాల్సినవసరం ఉంది. కామాంధుల బారినుంచి మహిళలు, బాలికలను కాపాడాల్సినవసరం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!