అవిశ్వాస ప‌రీక్ష‌.. బ‌ల‌ప‌రీక్ష విన్నాం.. కానీ.. ఇదేమి ప‌రీక్ష‌..?


 రాజ‌కీయాల్లో ప్ర‌తిప‌క్షాల నోటినుండి వినే మాట అవిశ్వాస ప‌రీక్ష‌, ప్ర‌భుత్వం నిల‌దొక్కుకోవ‌డానికి బ‌ల‌ప‌రీక్ష‌.. ఇలాంటి ప‌రీక్ష‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌నం విన్నాం కానీ.. క‌ర్నాట‌క‌లో మ‌రో కొత్త ప‌రీక్ష‌కి తెర‌లేవ‌బోతోంది.. అదే స‌త్య ప‌రీక్ష‌.. బ‌ల‌ప‌రీక్ష‌లో ప్ర‌భుత్వానికి ఎంత మ‌ద్ద‌తు ఉందో తెలుస్తోంది.. అవిశ్వాస ప‌రీక్ష‌లో ప్ర‌తిప‌క్ష‌లు పెట్టే అవివ్వాసం గురించి తెలుస్తోంది.. మ‌రీ స‌త్య ప‌రీక్ష‌లో ఏం తెలుస్తుంది..? అని అనుకుంటున్నారా..? అన్ని ప‌రీక్ష‌లు అయిపోయిన త‌ర్వాత ఇక నాయ‌కులు త‌మ నిజాయితీని నిరూపించుకోవ‌డానికి ఉప‌యోగించుకునేదే ఈ స‌త్య ప‌రీక్ష‌.. అంటే భ‌గ‌వంతుడి ముందు ప్ర‌మాణం చేయ‌డం.. ఇప్పుడు ఇలాంటి స‌త్య ప‌రీక్ష క‌ర్నాట‌క సి.ఎం. య‌డ్యూర‌ప్ప‌, మాజీ సి.ఎం. హెచ్‌.డి. కుమార‌స్వామి మ‌ధ్య‌లో జ‌ర‌గ‌బోతోంది. ఇంత‌కీ వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది..?  కొద్ది రోజుల క్రితం సి.ఎం. య‌డ్యూర‌ప్ప విష‌యంలో ఏదో ఆరోప‌ణ చేసి ఆయ‌న్ని ఇరికించ‌డానికి కుమార‌స్వామి ప్ర‌య‌త్నించార‌ట‌.. దాంతో ఇర‌కాటంలో ప‌డ్డ య‌డ్యూర‌ప్ప త‌న‌ని విమ‌ర్శించ‌కుండా ఉండేందుకు కుమార‌స్వామికి భారీ మొత్తం లో డ‌బ్బు ఇవ్వ‌జూపాడ‌న్న‌ది కుమార‌స్వామి వాద‌న‌..  తాను ఎవ్వ‌రికీ డ‌బ్బు ఇవ్వ‌జూప‌లేద‌ని.. నేను డ‌బ్బు ఇచ్చిన‌ట్టుగా ధర్మశాలలోని మంజునాధ స్వామి ఆల‌యంలోకి వ‌చ్చి దేవుడి ముందు ప్ర‌మాణం చేయాల‌ని య‌డ్యూర‌ప్ప కుమార‌స్వామికి స‌వాల్ విసిరారు.. ఆ స‌వాల్‌ని స్వీక‌రించిన కుమార‌స్వామి ధ‌ర్మ‌శాల‌కి వ‌చ్చి మంజునాధ ఆల‌యం లో ప్ర‌మాణం చేయ‌డానికి సిద్ద‌ప‌డ్డారు.. ఈ నెల 27 న వీరిద్ద‌రూ ధ‌ర్మ‌శాల‌లోని మంజునాధ ఆల‌యంలో దేవుడి ముందు ప్ర‌మాణం చేయ‌డానికి సిద్ద‌ప‌డ్డారు.. మ‌రి.. ఈ స‌త్య ప‌రీక్ష‌లో ఎవ‌రు స‌త్యం చెబుతున్నార‌న్న‌ది.. తెలుస్తుందా..? ఒక వేల ఇద్ద‌రూ త‌మ త‌మ మాట‌ల‌కు క‌ట్టుబ‌డి దేవుడి ముందు ప్ర‌మాణం చేసి.. ఆ దేవుడినే ఇర‌కాటంలో పెడ‌తారా.. అన్న‌ది చూడాలి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!