మంత్రి శంకరరావునూ వ‌దిలిపెట్ట‌లేదు..



తెలంగాణ సిద్దాంత కర్త ఫ్రొఫెసర్ జయశంకర్ కు నివాళులర్పించడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పి.శంకరరావుపై టిఆర్ఎస్, ఇతర తెలంగాణ ఉద్యమానికి సంబందించినవారు దాడి చేసి గందరగోళం సృష్టించారు. దాడిలో చెప్పులు,రాళ్లు, ఇసుక విసిరారు. శంకరావు కారు అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు ఎవరు వచ్చినా తెలంగాణ ఉద్యమకారులు ఈ విధంగానే స్పందిస్తున్నారు. ఎంత పోలీసు భద్రత ఉన్నా కాంగ్రెస్, టిడిపి నాయకులకు అవమానం జరుగుతోంది. ఒక దశలో శంకరరావును రక్షించడం పోలీసులకు కష్టసాధ్యమైంది. ఆయనకు చుట్టూరా పహారా నిలబడి కారు ఎక్కించి పంపించారు. హన్మకొండలోని ఏకశిలాపార్కులో జయశంకర్ మృతదేహం ఉన్న చోటకు శంకరరావు వెళ్ళి నివాళి అర్పించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.ఉద్రిక్త పరిస్థితుల మద్య శంకరరావు హైదరాబాద్ కు వెనుదిరిగారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలకు చెందినవారు జయశంకర్ అంతిమయాత్రలో పాల్గొనవద్దని జెఎసి నేతలు కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!