ఆగ‌స్టు 1 నుండి ఉద్యమం..


రాజీనామాల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మరోసారి రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం తెలంగాణ నేతలు.. ఎప్పుడు చేస్తామనేది ఆగస్టు 1 న ప్రకటిస్తామని ఫోరం సభ్యలు తెలిపారు. కాగా ఆగస్టు నుంచి రాజకీయ జేఏసీ నిర్వహిస్తున్న సకల జనుల సమ్మెకు తమ పూర్తి మద్దతుంటుందని.. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి స్పష్టం చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టాలని.. ఆగస్టు 1 న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తమ భవిష్యత్ కార్యాచరణ అంతా అదే వేదికపైనే ప్రకటిస్తామన్నారు. రాజీనామాల విషయం, రాజ్యాంగ సంక్షోభం తేవాలన్న విషయాన్ని అదే వేదికపైనే ప్రకటిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డికి పార్లమెంట్ లో నివాళులు అర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎర్రబెల్లి, రమణ, కొత్తకోట దయాకర్రావు తెలిపారు. తమల్ని రెచ్చగొట్టి.. తీవ్రవాదులుగా మార్చొద్దని వారు హెచ్చరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!