ఆగ‌స్టు 5న‌ తెలంగాణ బంద్‌..


తెలంగాణ జిల్లాలో మ‌ళ్లీ ఒకరోజు బంద్ వ‌చ్చేస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 14ఎఫ్ తొలగించ కుండా ఎస్సై పరీక్షలు నిర్వహించాలని మొండిగా వెళితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నారు. 14ఎఫ్ రద్దు చేయకుండా ఎస్సై పరీక్షలు నిర్వహిస్తే.. ప‌రీక్ష‌ల‌ను అడ్డుకోవ‌డానికి  ఆగస్టు 1న రాస్తా రోకోలు, 2వ తేదిన నిరసన ర్యాలీలు, 3వ తేదిన ముఖ్యమంత్రి, డిజిపి దిష్టి బొమ్మలు దగ్ధం, 4వ తేదిన అఖిల పక్షాలతో రౌండ్ టేబులు సమావేశం నిర్వహిస్తామ‌ని అప్పటికీ ముఖ్యమంత్రి దిగి రాకుంటే ఆగ‌స్టు 5న తెలంగాణ బంద్‌కి పిలుపునిస్తాన‌ని అన్నారు. ఎస్సై పరీక్షల రద్దు కోరుతూ విద్యార్థి జెఏసి చేస్తున్న ఆందోళనలో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!