లోకాయుక్త పై బిజెపి విసుర్లు


కర్నాటక లోకాయుక్తపై ఆ రాష్ట్ర మంత్రులు ఎదురు దాడి ఆరంభించారు.లోకాయుక్తలో అనేక తప్పులు ఉన్నాయని వారు వాదిస్తున్నారు. ప్రత్యేకించి బళ్లారి కి చెందిన గాలి సోదరులు దీనిపై మండిపడుతున్నారు. తాను నాలుగేళ్ల క్రితమే మైనింగ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటే, లోకాయుక్త తనపై వ్యాఖ్యలు చేయడం ఏమిటని గాలి కరుణాకరరెడ్డి ప్రశ్నిస్తు న్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ భరద్వాజకు ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా బిజెపి సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడు ఎమ్.వెంకయ్య నాయుడు కూడా లోకాయుక్తను తప్పుపడుతూ మాట్లాడడం విశేషం. ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప స్వయంగా ఇనుప ఖనిజ తవ్వకాలను నిషేధించారని, ఈయన అధికారంలోకి వచ్చాక ఒక్క మైనింగ్ లీజ్ కూడా ఇవ్వలేదని , అయినప్పటికీ ఆయనపై కూడా లోకాయుక్త అభియోగాలు చేసిందని ఆయన అన్నారు. అయితే బిజెపి మాత్రం విలువలకు కట్టుబడి ముఖ్యమంత్రితో రాజీనామా చేయిస్తున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని వెంకయ్య నాయుడు ఆరోపించారు.కాగా బిజెపికి చెందిన పన్నెండు మంది ఎమ్.పిలు లోకాయుక్త నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసి ముఖ్యమంత్రి ఎడ్యూరప్పను మార్చాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని సూచించడం కొసమెరుపు. ఎడ్యూరప్ప చివరి నిమిషం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.పధ్నాలుగుమంది ఎమ్.పిలు, మెజార్టీ ఎమ్మెల్యేలు వెంకయ్యనాయుడును కలిసి ఎడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని డిమాండు చేయడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!