లార్డ్స్‌లోరికార్డు సృష్టించేనా?


లార్డ్స్ మైదానంలో ప్రతిష్టాత్మక‌మైన టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ ఎదురీదుతోంది. ఇంగ్లాండ్ విసిరిన 458 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించే క్రమంలో  నాలుగోరోజు ఆట ముగిసే స‌మ‌య‌డానికి భార‌త్ 1 వికెట్ న‌ష్టానికి 80 ప‌రుగులు చేసింది. విజయానికి ఇంకా 378 పరుగులు చేయాల్సి ఉండగా..క్రీజులో ద్రావిడ్ (34), లక్ష్మణ్ (32) ఉన్నారు. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్కరోజు స‌మ‌యం ఉండ‌డంతో 378 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని భార‌త్ ఛేధిస్తుందా లేదా..? అన్నదే ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో ఉత్సంఠ క‌లిగిస్తోంది. ఇక స‌చిన్ ఈ రెండో ఇన్నింగ్స్‌లోనైనా శ‌త‌కం చేసి అభిమానుల‌ని అల‌రిస్తాడ‌నుకున్నా.. జ్వరంతో బాధ‌ప‌డుతున్న స‌చిన్ ఆల‌స్యంగా బ్యాటింగ్‌కి దిగబోతున్నాడ‌న్నది చేదు వార్త. ఇక ఇప్పుడు భార‌త్‌కు రెండు అవ‌కాశాలున్నాయి.. ఒక‌టి టెస్ట్‌ని డ్రాతో ముగించేయ‌డ‌మో.. లేక భారీ విజ‌య ల‌క్ష్యాన్ని చేధించి రికార్డు సృష్టించ‌డ‌మో.. మ‌రి ఏం జ‌రుగుతుందో.. వేచి చూద్దాం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!