కాంగ్రెస్ అంతా జోక‌ర్ల‌మ‌యం..


ఈ మధ్య మణిశంకర్ అయ్యర్ కొత్త విషయాలు అనేకం తెలుస్తున్నట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక సర్కస్ వంటిదని, అందులో తొంభై శాతం మంది జోకర్లు అని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు.పది శాతం మంది మాత్రమే చక్రం తిప్పుతున్నారని ఆయన అభిప్రయా పడుతున్నారు. అంతకంటే మరీ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. డిల్లీలో ఎ.ఐ.సి.సి. అద్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ లు మాత్రమే శక్తివంతులని, వారి వద్దకే అంతా వెళతారని, పనికిరాని కార్యకర్తలు మాత్రమే అక్బర్ రోడ్ లోని 24 క్వార్టర్ కు వెళతారని ఆయన అన్నారు. ఇదే పేరుమీద రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 24 అక్బర్ రోడ్ లోనే కాంగ్రెస్ ఆఫీస్ పనిచేస్తుంది.నిజానికి పార్టీ కార్యాలయానికి సోనియాగాందీ వచ్చినప్పుడు ఉండే హడావుడి మిగిలిన సమయంలో ఉండదు. పార్టీ కార్యాలయంలో ఏ సమావేశం జరిగినా చివరికి నిర్ణయం జరగాల్సింది సోనియా ఇంటిలోనేనన్న సంగతిని మణిశంకర్ అయ్యర్ స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఇదేదో ఇప్పుడే జరుగుతున్నట్లు అయ్యర్ చెప్పడం విచిత్రం.ఈ నాయకులంతా పదవులలో ఉంటే ఒకరకంగా, లేకుంటే మరోరకంగా మాట్లాడుతుంటారు.నిజానికి ఇందిరాగాంధీ హయాం నుంచి ఇప్పటివరకు ఎఐసిసి అధ్యక్ష పదవిలో ఉన్నవారి చుట్టూనే రాజకీయం నడుస్తుంటుందన్నది వాస్తవం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!