రాజీనామాల‌ను తిస్కరించిన స్పీక‌ర్‌


తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దాదాపు 103 మంది శానససభ్యులు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతూ శనివారం రాత్రి తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించారు. శాసనసభ్యులు భావోద్వేగాలకు గురై రాజీనామాలు చేశారని, అందువల్ల రాజీనామాలను తిరస్కరిస్తున్నానని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. భావోద్వేగాలకు గురై రాజీనామాలు చేసినందున ఆమోదించలేమని ఆయన చెప్పారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేసినప్పటికీ వాటిని ఆయన తిరస్కరించారు.
అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాతనే తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించినట్లు మనోహర్ చెప్పారు. లండన్ వెళ్లిన నాదెండ్ల మనోహర్ ఆగస్టు మొదటివారంలో తిరిగి హైదరాబాద్ వస్తారు. శాసనసభ్యులను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన స్పీకర్ అందుకు భిన్నంగా రాజీనామాలను తిరస్కరించారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించడానికే స్పీకర్ రాజీనామాలను తిరస్కరించినట్లు భావిస్తున్నారు. స్పీకర్ రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు రేపు ఆదివారం సమావేశమవుతున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు కూడా రేపు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించు కుంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!