భ‌ద్ర‌త స‌దుపాయాలే ప్ర‌ధాన ఎజెండా..!


ముంబై పేలుళ్ల తర్వాత మహారాష్ట్రకు రెండువేల బుల్లట్ ఫ్రూఫ్ జాకెట్లను సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయిం చింది. అంతేకాక మహారాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రతకు సంబంధిం చిన సదుపాయాలను ప్రధాన ఎజెండాకు చేసుకోవలసిందిగా కూడా కేంద్రం సలహా ఇచ్చింది.మహారాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఈ విషయాన్ని శాసనమండలిలో తెలిపారు. కేంద్రం హోం మంత్రి చిదంబరం రాష్ట్రానికి ఒక ఆదేశాన్ని పంపుతూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాల సేకరణ వంటి వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మహరాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.నిఘా వ్యవస్థ కనుక పసి కట్టగలిగి ఉంటే టెర్రరిస్టుల దాడులను అరికట్టకలిగి ఉండేవారమని ఆయన అన్నారు.ముంబై వీధులలోని ఆక్రమణలను తొలగించడానికి చర్యలు చేపడుతున్నామని, వీటి వల్ల కూడా ఉగ్రవాదుల దాడులకు దోహదం అవుతున్నాయని ఆయన అన్నారు.అనుమానితులను గుర్తించడంలో పౌరులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని, వారు కూడా పౌర పోలీసులుగా వ్యవహరించాలని, ఇందుకోసం ఒక ప్రత్యేక పధకాన్ని తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు.అలాగే అమ్మోనియం నైట్రేట్ ను నియంత్రిం చడానికి అవసరమైన నిర్ణయాన్ని సత్వరమే తీసుకోవాలని కూడా కేంద్రాన్నికోరామని పాటిల్ చెప్పారు. ఉగ్రవాదు లను ఎదుర్కోవడానికి అవసరమైనప్పుడు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!