కే.సి.ఆర్. మోసం చేస్తున్నాడు..


తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు మోసం చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. రెండు వారాలలో తెలంగాణ వస్తుందని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఆ మాట గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై ఎప్పుడూ కెసిఆర్ ఏదో ఒకటి చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుల దీక్ష శిబిరానికి వెళ్లి రెండువారాలలో తెలంగాణపై కేంద్రం ఒక ప్రకట చేస్తుందని కెసిఆర్ ఏ ఆధారంతో చెప్పారని దయాకరరావు ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ సాధనకోసం అందరు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. కేవలం ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు పనిచేసుకుంటూ పోతే దానివల్ల ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!