తీగ‌లాగితే డొంక క‌దిలింది..!


వివాహేతర సంబంధాలు ఎంత ప్రమాదకరమో విజయవాడ తెలుగుదేశం నాయకుడి హత్య తెలియ చేస్తుంది. మనుషుల మధ్య అసూయ,ద్వేషం,ఆగ్రహం, కక్షలకు అది దారి తీస్తుంది.అందులోను ఒక వివాహిత మహిళతో ఈ నాయకుడు పెట్టుకున్న సంబంధం అతని ప్రాణానికే ముప్పు తెచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.తన అనుచరుడిని వేరే పార్టీవారు హత్య చేశారేమోనని అనుమానించి ఫిర్యాదు చేసిన విజయవాడ అర్బన్ తెలుగుదేశం నాయకుడు వంశికి అసలు విషయం తెలిసి మతి పోయినంతపైనందని అంటున్నారు. పైగా వంశికి కూడా మరో వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కధనం రాయడం మరో మలుపుగా ఉంది.కొద్ది రోజుల క్రితం వడ్లమూడి మోహన్ అనే తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య నేత మృత దేహం నిడమానూరు హైవే పక్కన కనిపించింది. ఇది రోడ్డు ప్రమాదం అని మొదట పోలీసులు అనుమానించారు. కాని విజయవాడ అర్బన్ తెలుగుదేశం అధ్యక్షుడు వంశి దీనిని హత్యగా అనుమానిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్ధి పార్టీ వారెవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారని అభిప్రాయపడ్డారు.దానితో పోలీసులు దీనిపై విచారణ జరపడం మొదలుపెట్టారు.తీగ లాగితే డొంక కదిలినట్లు అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి.ఒక రవాణా కంపెనీ యజమాని నాగరాజు ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని తేలింది. దానికి కారణం అతని భార్య నళినితో మోహన్ కు అక్రమ సంబంధం ఏర్పడింది. అది కూడా ఎలా ఏర్పడిందంటే టిడిపి నేత వంశి నాగరాజు ఇంటికి వెళుతుంటూ మోహన్ కూడా ఆయనతో పాటు వెళ్లేవారట.ఆ పరిచయం నళినితో సంబంధం ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. అయితే నళినికి, మోహన్ కు గతంలోనే పరిచయాలు ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు.కాగా మోహన్ పై ద్వేషం పెంచుకున్న నాగరాజు తన భార్య నళిని ద్వారా మోహన్ ను ఇంటికి పిలిపించారు.ఆ తర్వాత తన అనుచరులతో కలిసి మోహన్ పై దాడిచేసి అతను చనిపోయేవరకు కమిలి దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.కారులో శవాన్ని తెచ్చి రోడ్డుపక్కన పడేశారు. అయితే ప్రమాదం అయితే మోటారు సైకిల్ కూడా దెబ్బతినాలికదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఈ విషయాలన్ని బయటపడ్డాయి. ప్రస్తుతం నాగరాజు కుటుంబం అంతా పరారీలోఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!