మైనింగ్ కింగ్‌కి ఎదురుగాలి..


మైనింగ్ కింగ్‌గా పేరు సంపాదించుకున్న కర్ణాటక మంత్రి గాలి జ‌నార్థ‌న్‌రెడ్డికి ప్ర‌స్తుతం ఎదురు గాలి వీస్తోంది.  గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బళ్లారి గనుల డబ్బంతా ఎటు వెళ్లిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాధి కారులకు వెల్లడించిన సొమ్ము కన్నా ఎక్కువ స్థాయిలో లావాదేవీలు జరిగాయని అక్రమ మైనింగ్‌పై తుది నివేదిక తెలియజేస్తోది. ఆ సొమ్ము విషయంలో గాలి సోదరులు పన్ను ఎగవేతకు, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకొడా మాదిరిగానే గాలి బ్రదర్స్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న 215.12 కోట్ల రూపాయల విషయంలో ఐటి శాఖ దర్యాప్తు చేసి కచ్చితమైన నష్టాన్ని అంచనా వేసి, భారత్‌కు ఆ డబ్బును రప్పించే ఏర్పాట్లు చేయాలని నివేదిక సూచించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) నుంచి అక్రమంగా విదేశాలకు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, మంత్రి శ్రీరాములు తరలించారని యువి సింగ్ నేతృత్వంలోని అధికారులు కనిపెట్టారు. ఇప్ప‌టికే గాలి జ‌నార్థ‌న్‌రెడ్డిపై ఎన్నో ఆరోప‌ణ‌లు ఉన్న‌ప్ప‌టికీ అధికార బ‌లంతో వాట‌న్నింటినీ దాటుకుని వెళ్ళిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ అనిశ్చితి దృష్ట్యా గాలి జ‌నార్థ‌న్ రెడ్డి, ఆయ‌న సోద‌రుడు క‌రుణాక‌ర్ రెడ్డి, మ‌రో మంత్రి శ్రీ‌రాముల మంత్రి ప‌ద‌వులు కూడా ఊడిపోయే అవ‌కాశాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ ఎదురుగాలి నుండి గాలి సోద‌రులు ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!