శిరీష్‌భ‌ర‌ద్వాజ్ లొంగుబాటు


మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు శిరీష్ భరధ్వాజ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయారు.చిరంజీవి చిన్న కూతురు శ్రీజ , శిరీష్ భరద్వాజలు గతంలో ప్రేమించి తల్లిదండ్రులకు సంబంధం లేకుండా ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక సంతానాన్ని కూడా కన్నారు. కాని మధ్యలో వీరిద్దరి మధ్య విబేధాలు చోటు చేసుకకున్నాయి. డబ్బు కోసం తనను భర్త, అత్తలు వేధిస్తున్నారని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం అయింది. ఆ తర్వాత ఆమె శిరీష్ నుంచి వేరుపడి చిరంజీవి దగ్గరు వచ్చేసింది. తమను కావాలని విడదీస్తున్నారని శిరీష్ ఆరోపించారు. అయినప్పటికీ వారిపై కేసు నమోదవడం, ఇద్దరికి కౌన్సిలింగ్ చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ అది సపలం కాలేదు. ఇక కేసుకు సంబందించి తనను అరెస్టు చేయరాదంటూ శిరీష్ కోర్టుకు వెళ్లారు. కాని అనుకూలంగా తీర్పు రాకపోవడంతో బుధవారంనాడు నాంపల్లి కోర్టులో లొంగిపోయారు.గత మూడు నెలలుగా శిరీ్ష్ అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు కోర్టులో లొంగిపోయారు.కాగా శ్రీజ ఉన్నత విద్య కోసం దుబాయి వెళ్లాలని యోచన చేస్తున్నట్లు కొన్ని కదనాలు వచ్చాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!