ఐదుగురు భామలతో మోహన్ బాబు


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సునీల్ కాంబినేషన్లో రాయుడు గార్కి కోపమొచ్చింది….అనే సినిమాని రూపొందించ డానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే…విలక్షణ నటుడు మోహన్ బాబు మళ్లీ కథానాయకుడుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఓ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ చిత్రానికి ఇ నివాస్ దర్శకత్వం వహిస్తాడు. దీనికి కోన వెంకట్, గోపీమోహన్, బి.వి.యస్.రవి రచయితలుగా పనిచేస్తున్నారు. ఈ సినిమా గురించి మోహన్ బాబు మాట్లాడుతూ, ‘ముగ్గురు రచయితలు ఏడాది పాటు కష్టపడి దీనికి ఓ అద్భుతమైన కథ తయారుచేశారు. ఇది మా బ్యానర్లో మరో మంచి సినిమా అవుతుంది. ఐదుగురు హీరోయిన్లు వుంటారు. ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. ఈ రోజు తన మేరేజ్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని మోహన్ బాబు ప్రకటించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!