స్పీక‌ర్‌పై నాగం గ‌రం..గ‌రం..


తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాలు ఆమోదించని సభాపతి నాదెండ్ల మనోహర్ లండన్ పర్యటన నుండి తిరిగి వచ్చాక ఆయన పని చెప్తామని తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం అన్నారు. స్పీకరు తమ రాజీనామాలు ఆమోదించక పోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింటు వద్దకు వెళ్లకుండా ముళ్లకంచె వేయడం పైన నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు మీడియా పాయింటు వద్ద మాట్లాడకుంటా చేయడం ద్వారా వారి గొంతు నొక్కే ప్రయత్నాలు స్పీకరు చేస్తున్నారని ఆరోపించారు. స్పీకరుకు ఆ స్థానంలో కూర్చునే హక్కు లేదన్నారు. ఆయనను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!