ఆత్మాహుతి దాడులు చేసే వారితోనా..?


ఆత్మాహుతి దాడులు చేస్తామంటున్న ఆంధ్రులతో కలిసి ఉండవలసిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి హైదరాబాద్ తీసుకురావడానికి ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కేశవ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి ఆత్మాహుతి దాడులు చేస్తానన్నవారితో తాము కలిసి ఉండవలసిన అవసరం లేదని అంటున్నారు.కాని కేశవ్ వ్యాఖ్యలు చేస్తే , మొత్తం ఆంద్రులందరి మాట అదే అనుకుంటే ఎలాగో అర్ధం కాదు.కాంగ్రెస్ ఎమ్.పి మధుయాష్కి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని విజ్ఞప్తి చేశారు.కాగా మంత్రి కోమటిరెడ్డి మరో అడుగు ముందుకేసి తెలంగాణలో జరిగే ఆత్మహత్యలన్నీ సీమాంధ్రులు చేసే హత్యలని వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!