మాట మార్చిన రాజా..!


కేంద్ర మాజీ మంత్రి, డి.ఎమ్.కె. నేత ఎ.రాజా మంగళవారం నాడు మాట మార్చారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో రాజా తన వాదనను స్వయంగా వినిపించుకుంటున్న క్రమంలో సోమ వారంనాడు ఆనాటి ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరం, స్పెక్ట్రం ఫైల్ పై సంతకం చేశారని, ప్రధాని సమక్షంలోనే నిర్ణయాలు జరిగాయని పేర్కొన్నారు. ఆ వార్తలకు దేశవ్యాప్తంగా విశేష ప్రధాన్యం లభించింది. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితిలో పడింది. ఈ నేపధ్యంలో డి.ఎమ్.కె. వర్గాల ద్వారా ఒత్తిడి చేశారో, మరే కారణమో తెలియదు కాని రాజా మంగళవారం నాడు తన ప్రకటనను మీడియా వక్రీకరణగా కొట్టిపారేశారు. తానెవరిపై ఆరోపణలు చేయాలేదని అంటున్నారు. తాను ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి చిదంబరం పేర్లను ప్రస్తావించలేదని అంటున్నారు. డి.ఎమ్.కె అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి కూడా రాజాతోపాటు తీహారు జైలులోనే ఉన్న నేపధ్యంలో రాజా తన ప్రకటనను మార్చుకున్న వైనం ఆసక్తికరంగా ఉంది. సహజంగానే ఇలాంటి కేసులలో ఏదో బలమైన కారణం లేకుండా నిందితులు తమ ప్రకటనలను మార్చుకోరు. రాజా వెనుక ఏ శక్తి పనిచేసిందో మరి కొద్ది రోజులలో బయటపడవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!