ధోని బౌలింగ్ చేసాడు..!


ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ టెస్టులో మరో అద్భుతం జరిగింది. ఎప్పుడూ వికెట్ల వెనకాలే కనబడే ఇండియన్ టీమ్ కేప్టెన్ ధోని.. ఈసారి చేతిలో బౌల్ పట్టుకుని వికెట్ తీసే పనిలో పడ్డాడు. ఎప్పుడూ ఏదో ప్రయోగం చేస్తూ.. జట్టు విజయం కోసం పరితపించే ధోనీ.. ఈ సారి ఏకంగా తానే బాల్ పట్టి.. వికెట్ల వేటకు దిగారు. చాలా సమయం నుంచి వికెట్లు పడకపోవడం.. మేయిన్ బౌలర్లకు వికెట్లు పడకపోవడంతో.. తానే బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 2000 వ మ్యాచ్. మరోవైపు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇది 100 వ మ్యాచ్. అలాగే ఈ టెస్టు సిరీస్ లో సచిన్ వందో శతకం చేస్తారని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన టెస్టు లో ధోనీ బౌలింగ్ చేశారు. లార్డ్స్ టెస్ట్ రెండో రోజున తను ఈ ప్రయోగం చేశారు. మొదటి బంతికే సెంచరీ వీరుడు కెవిన్ పీటర్సన్ ను ఔట్ చేసేంత పనిచేశాడు. మరోవైపు ధోనీ బౌలింగ్ సమయంలో ద్రావిడ్ కీపింగ్ చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!